దారుణం.. ప్రసాదంలో మత్తుమందు కలిపి.. భక్తురాలిపై అత్యాచారం

డ్రగ్స్ కలిపిన ప్రసాదం ఇచ్చి.. ఒక మహిళపై బాబా బాలక్ నాథ్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.

Update: 2024-10-22 08:21 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆలయానికి వచ్చిన మహిళకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చి పూజారి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ (Rajastan) లో వెలుగుచూసింది. బాధితురాలు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై కేసు నమోదైంది. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. సికార్ జిల్లాలోని ఒక దేవాలయంలో బాబా బాలక్ నాథ్ అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. దైవ దర్శనానికి ఆలయానికి వెళ్లిన బాధిత మహిళతో పరిచయం పెంచుకుని, తన కుటుంబ సమస్యలన్నీ పరిష్కరిస్తానని నమ్మబలికాడు. దేవుడికి నివేదించిన ప్రసాదం తింటే సమస్యలు తగ్గుతాయని నమ్మించి.. మత్తుమందు కలిపిన ప్రసాదం పెట్టాడు.

అది తిన్నాక స్పృహ కోల్పోయిన తనపై మూడుసార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరగ్గా.. అదంతా బాబా డ్రైవర్ కెమెరాలో రికార్డ్ చేశాడని తెలిపింది. విషయం తెలుసుకున్నాక అతడిని ప్రశ్నించగా.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని, వీడియో నెట్ లో పెట్టి వైరల్ చేస్తామని అతని అనుచరులు బెదిరించారని బాధితురాలు వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాబాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


Similar News