మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్య..

ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎక్కామెడ్ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-10-23 06:36 GMT

దిశ, కొత్తపల్లి : ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎక్కామెడ్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన హరజన్ ఛంద్రప్ప (40) మంగళవారం రాత్రి అందరూ పడుకున్న తరువాత మద్యం మత్తులో స్లాబుకు వేసిన ఊయల కొండీకి చీరతో వేసి ఉరేసుకున్నాడు.

నెల రోజుల క్రితం భార్యతో గొడవ పడుతున్న సమయంలో చెవికి గాయం కాగా ఆమె పుట్టింటికి వెళ్ళింది. ఈ క్రమంలో నెలరోజులుగా మద్యానికి బాని సై రాత్రివేళ ఉరేసుకున్నాడని తెలిపారు. మృతునికి భార్య రాములమ్మ, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని నారాయణ పేట ఆసుపత్రికి శవ పంచనామాకు తరలించారు. భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్ లాల్ తెలిపారు.


Similar News