పెద్ద మొత్తంలో విదేశి లిక్కర్ పట్టివేత..

ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి పెద్ద మొత్తంలో ఫారిన్ లిక్కర్ సీజ్ చేశారు.

Update: 2025-03-22 05:55 GMT
పెద్ద మొత్తంలో విదేశి లిక్కర్ పట్టివేత..
  • whatsapp icon

దిశ, హిమాయత్ నగర్ : దిశ, హిమాయత్ నగర్ : బషీర్బాగ్ కేఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 233 ఫారిన్ లిక్కర్ బాటిల్ లను హైదరాబాద్ ఎన్ ఫోర్స్ బీ టీం పట్టుకుంది. 174.5 లీటర్ల మద్యం, 24 రకాల 233 ఫారెన్ మద్యం బాటిల్స్ ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ బి టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీం పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ తెలంగాణ మద్యం ధరల ప్రకారం రూ.9,68,150 విలువ ఉంటుందని అంచనా వేశారు. మద్యం బాటిళ్లతో పాటు ఒక కారును రూ. 35 వేల నగదును రెండు సెల్ఫోన్లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. హరీష్ కుమార్ హిర్వాణి అనే వ్యక్తి గతంలో మద్యం వ్యాపారిగా కొనసాగారు.

గత టెండర్స్ లో మద్యం దుకాణం రాకపోవడంతో తన కున్నటువంటి టాటా వాటర్ గోదాములో ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పిస్తూ 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి బాటిల్ పై రూ. 1500 వందల నుంచి రూ.2000 రూపాయలు లాభాలను ఆర్జిస్తున్న ట్లు విచారణలో వెల్లడైంది. ఢిల్లీకి చెందినటువంటి మద్యం వ్యాపారులు దీపక్, ధర్మ బట్టి, సునీల్పై కూడా కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కే. ఏ. బీ శాస్త్రి, ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, సీఐ చంద్రశేఖర్ గౌడ్ లు వెల్లడించారు. ఫారిన్ లిక్కర్ ను పట్టుకున్నటువంటి బృందంలో ఎన్ ఫోర్స్ సీఐ ఎస్. చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై ఎన్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సాయి కుమార్, ప్రసాద్, గోపాల్, నవీన్, తరుణి,రాజ్ ఠాకూర్ లో ఉన్నారు. ఎన్డీపీఎల్ మద్యం పట్టుకున్న టువంటి ఎన్ ఫోర్స్ టీం కి టీం చంద్రశేఖర్ గౌడ్ ను టీం సభ్యులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలహాసన్ రెడ్డి స్వయంగా పిలిచి అభినందించారు.


Similar News