హసన్ పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం
హనుమకొండ జిల్లా హసన్ పర్తి పెద్ద చెరువు మూలమలుపు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్ పర్తి పెద్ద చెరువు మూలమలుపు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీ కొట్టడంతో బైక్పై ఉన్న దుర్గం పవన్, పౌతు మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హసన్ పర్తి నుండి సీతంపేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో హనుమకొండ నుండి కరీంనగర్ వెళ్లే హైవేపై భారీగా ట్రాఫిక్ జామైంది. ఈ విషయం తెలుసుకున్న హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.