జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం..

కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో జాతీయ రహదారి నెత్తురోడింది. 44వ నెంబర్ నేషనల్ హైవే పై కారును కంటైనర్ ఢీ కొట్టింది.

Update: 2023-03-05 13:24 GMT

దిశ, కామారెడ్డి రూరల్ :  కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో జాతీయ రహాదారి నెత్తురోడింది. 44వ నెంబర్ నేషనల్ హైవే పై కారును కంటైనర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం కామారెడ్డి శివారులోని జాతీయ రహదారి 44 గర్గుల్ బ్రిడ్జి వద్ద కారును వెనుక నుంచి కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మహోధర్ ( మోహన్ ) రావు (45), మధుసూదన్ రెడ్డి ( 47 ) అక్కడికక్కడే మృతి చెందారు.

మధుసూదన్ రెడ్డి సిద్ధిపేట మెడికల్ కళాశాల సీఈఓ తమ్ముడు అని తెలిసింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారులో ఇరుక్కున్న మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న దేవునిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారన్నారు. ప్రమాధానికి కారణం ఐన కంటైనర్ డ్రైవర్ వాహనం వదిలి పరారయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News