ట్రాక్‌పై ఇనుపరాడ్లు వేసిన దుండగులు.. చక్రాల్లో ఇరుక్కోవడంతో ఏం జరిగిందంటే..

బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది.

Update: 2024-10-23 05:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం అర్థరాత్రి కటిహార్ నుంచి జోగ్‌బని వెళ్తున్న డీఎంయూ ట్రైన్ చక్రంలో ఇనుపరాడ్డు ఇరుక్కోవడంతో ట్రైన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే లోకోపైలట్ సమయస్ఫూర్తితో ఎమర్జెన్సీ బ్రేక్‌ను ఉపయోగించి ట్రైన్‌ను ఆపేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఇనుపరాడ్డును కావాలనే కొందరు దుండగులు ట్రాక్‌పై పడేసినట్లు తెలుస్తోంది. రాణిపతరా ర్యాంక్ పాయింట్‌లో అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండడంతో ఈ ఘటన సీసీటీవీల్లో రికార్డయింది. దుండగులు కొంతమంది రైల్వే ట్రాక్‌పై కావాలనే ఇనుపరాడ్లు వేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. నిందితులను అతి త్వరలో గుర్తించడం జరుగుతుందని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


Similar News