చాలా విసిగిపోయాను.. అందుకే చంపి 59 ముక్కలు చేశా.. నిందితుడి సూసైడ్ నోట్‌లో విస్తుపోయే నిజాలు

బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మహాలక్ష్మి(26) అనే మహిళను ఓ వ్యక్తి అతి కిరాతంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-27 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మహాలక్ష్మి(26) అనే మహిళను ఓ వ్యక్తి అతి కిరాతంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 59 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు..మృతురాలి సహోద్యోగి ముక్తి రాజన్ రాయ్ అని, హత్యకు పాల్పడింది అతడే అని అనుమానించిన పోలీసులు.. ఇక అప్పటి నుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అతడు ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ఓ గ్రామంలో చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. ఇదిలా ఉంటే.. మహాలక్ష్మి హత్య కేసులో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి హత్య కేసు నిందితుడు తన సూసైడ్‌ నోట్‌లో విస్తుపోయే విషయాలను ప్రస్థావించాడు. ప్రస్తుతం ఆ సూసైడ్‌ నోట్‌ను‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరి ఇంతకీ ఆ నోట్‌లో ఏమున్నదంటే.. ’ఆమె ప్రవర్తనతో నేను చాలా విసిగి పోయాను. ఇదే విషయమై ఆమెతో గొడవపడగా, మహాలక్ష్మి నాపై దాడి చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన నేను క్షణికావేశంలో ఆమెను హత్య చేశాను. ఆమెను చంపిన తర్వాత, నేను ఆమె శరీరాన్ని వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి 59 ముక్కలుగా చేసి.. దుర్వాసన రాకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలను చల్లాను. ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఫ్రిజ్‌లో ఉంచాను. ఆమె ప్రవర్తనతో విసిగిపోయే ఈ పని చేశాను’ అని డైరీలో పేర్కొన్నాడు. కాగా హంతకుడు ముక్తిరంజన్ రాయ్ నివాసంలో సూసైడ్‌ నోటు దొరికినట్లు పోలీసులు తెలిపారు.


Similar News