కత్తులతో బెదిరించి.. అత్తాకోడళ్లపై గ్యాంగ్‌రేప్

శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగింది.

Update: 2024-10-12 06:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి అత్తాకోడళ్లపై గ్యాంగ్ రేప్ జరిగింది. వాచ్‌మెన్‌, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై ఐదుగురు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేశారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. బాధితులు ఉపాధి కోసం ఇటీవలే బళ్లారి నుంచి వచ్చినట్లు గుర్తించారు. వీళ్లంతా స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కుటుంబం ఒంటరిగా ఉండటాన్ని గతకొన్ని రోజులుగా గమనించిన వాళ్లే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News