షాక్ కొట్టిన జంతువును కాపాడబోయి.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు.

Update: 2024-09-28 11:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందారు. నిన్న(శుక్రవారం) సాయంత్రం ఇంటి బయట నీటిలో పడి ఉన్న కరెంటు వైర్ ఆవుకు తగలడంతో మిథున్(32) దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అతనికి షాక్ తగలడంతో తండ్రి పరేష్(60), దీపాలి తల్లి(55) కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిద్దరూ కూడా కరెంట్ షాక్‌కు బలయ్యారు. ఇలా ఆ ముగ్గురూ కూడా షాక్‌తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మనవడు సుమన్(2) సైతం ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News