పేపర్​ ప్లేట్స్​ తయారు చేస్తుండగా విద్యుత్​ షాక్​... యువకుడు మృతి

విద్యుత్​ షాక్​ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లేమూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Update: 2024-09-24 12:12 GMT

దిశ, మహేశ్వరం: విద్యుత్​షాక్​ కొట్టడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన కందుకూరు పోలీస్స్టే షన్ పరిధిలోని లేమూరు గ్రామంలో మంగళ వారం చోటు చేసుకుంది. కందుకూరు సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం లేమూరు గ్రామానికి చెందిన కందికంటి సాయికుమార్ (22) నాలుగు సంవత్సరాల నుంచి లేమూరు గ్రామంలో ఓ షట్టర్ అద్దెకు తీసుకొని పేపర్​ ప్లేట్లు తయారీ చేసి అమ్ముతున్నాడు.

    రోజువారి మాదిరిగానే మంగళవారం ఉదయం సాయికుమార్ తన షాపునకు వచ్చి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్​ తగిలింది. దాంతో మిషన్ మీద పడి మృతి చెందాడు. మంగళవారం మధ్యాహ్నం మృతుడి బావ కిషన్ షాపు వద్దకు వచ్చి చూడగా సాయికుమార్ చనిపోయి ఉన్నాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Tags:    

Similar News