కల్టివేటర్లు దొంగిలించిన వ్యక్తుల అరెస్ట్..

మద్యానికి బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు.

Update: 2023-05-03 15:06 GMT

దిశ, మహేశ్వరం: మద్యానికి బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. మహేశ్వరం ఏసీపీ అంజయ్య తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ కు చెందిన మహేందర్, రాజు, ఖదీర్, యూనస్ మహేశ్వరం మండలం కోళ్ల పడకల్, నాగారం, దుబ్బచర్ల గ్రామాలలో నిందితులు రాత్రి సమయంలో రెక్కీ నిర్వహించి వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్ ఐరన్ కల్టేవేటర్స్ 4, గుంటుక 4, దొంగిలిస్తున్నారు. పోలీసులు మన్సాన్ పల్లి లో వాహనాలను తనిఖీ చేస్తుండగా మూడు ట్రాలీ ఆటోలలో ఉన్న వ్యవసాయ పనిముట్లు కల్టీవేటర్ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రెండు లక్షల ఎనభై వేలు ఉంటుందన్నారు.

Tags:    

Similar News