ఓ వైపు తండ్రి మరణం.. మరోవైపు కొడుకు జననం..

ద్విచక్రవాహనం అదుపుతప్పి గాయాలపాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం రాజోలిలో చోటు చేసుకుంది.

Update: 2024-10-23 06:45 GMT

దిశ, రాజోలి : ద్విచక్రవాహనం అదుపుతప్పి గాయాలపాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన బుధవారం రాజోలిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళితే మండల కేంద్రంలో స్థానిక పెట్రోల్ బంకులో పనిచేస్తున్న కురువ శివ (28) విధులు నిర్వహిస్తుంటాడు. అయితే మంగళవారం భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయనే సమాచారం మేరకు హుటాహుటిన రాజోలి నుండి తుమ్మలపల్లెకు బయలుదేరాడు.

ఈ క్రమంలోనే బైక్ అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. శివ మృతి చెందిన గంట వ్యవధిలోనే మృతుని భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..


Similar News