వాహనం బోల్తాపడి వ్యక్తి మృతి

కూలి పనికి వెళ్లిన వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి మృతి చెందిన ఘటన చేగుంట మండల కేంద్రంలోని ఊర చెరువు సమీపంలో చోటు చేసుకుంది.

Update: 2024-10-05 14:59 GMT

దిశ, చేగుంట : కూలి పనికి వెళ్లిన వ్యక్తి ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి మృతి చెందిన ఘటన చేగుంట మండల కేంద్రంలోని ఊర చెరువు సమీపంలో చోటు చేసుకుంది. చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం బల్పాలపల్లి గ్రామానికి చెందిన మంత్రియల్ల నాగయ్య (43) అడ్డాపై కూలీగా పని చేస్తున్నాడు.

     మృతుడు ఈనెల 4వ తేదీ ఉదయం అడ్డా మీద కూలిపని కోసం వెళ్లగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మన్నెగూడకు చెందిన వీరముష్టి నాగేశ్వరరావు స్క్రాప్ వ్యాపారం చేస్తూ పని కోసం నాగయ్యను ఆర్మూర్ కు తీసుకు వెళ్లాడు. స్క్రాప్ లోడ్ చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో చేగుంట మండల కేంద్రంలోని ఊరచెరువు సమీపంలో అతివేగంగా వాహనం నడపగా ఆ వాహనం కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. వాహనంలో ఉన్న నాగయ్య కిందపడి మృతి చెందాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

Tags:    

Similar News