చేపల వేటకు వెళ్ళి.. అనంత లోకాలకు..

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది.

Update: 2024-10-19 06:23 GMT

దిశ, చేగుంట : చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన నార్సింగి మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. నార్సింగ్ ఎస్సై అహ్మద్ మోహినుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం నార్సంగి మండల పరిధిలోని నర్సంపల్లి గ్రామానికి చెందిన ఉడుత శ్రీనివాస్ (50) స్థానిక చెరువులో గత రాత్రి వేసిన చేపల వలలు తీయడానికి వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు. ఉడుత శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం చేపలకు వలవేసి శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వలలు తీయడానికి వెళ్ళగా ఫిట్స్ రావడంతో వల చుట్టుకుని మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేటకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News