తాగిన మైకంలో దారుణ హత్య

తాగిన మైకంలో మాటామాట పెరిగి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.

Update: 2024-10-13 10:31 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : తాగిన మైకంలో మాటామాట పెరిగి ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జగద్గిరిగుట్ట దీనబంధు కాలనీలో నదీమ్ (24) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుల పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన నదీమ్ అర్ధరాత్రి వరకు మద్యం సేవించాడు. ఆ పార్టీలో స్నేహితుల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తాగిన మైకంలో నదీమ్ ను హత్య చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Tags:    

Similar News