టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌కు కరోనా పాజిటివ్

దిశ, ఇల్లందు: తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేసిన నాటినుంచి కరోనా అదుపులోకి వచ్చినా.. రెండో వేవ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వైరస్ బారినపడి మరణిస్తున్న వారిసంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. రోజూ దాదాపు వెయ్యి మందికిపైగా వైరస్ బారినపడుతున్నారు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖులూ ఉన్నారు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారినపడ్డారు. గత రెండ్రోజులుగా హరితహారం కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న ఆమె కరోనా అనుమానిత లక్షణాలతో […]

Update: 2021-07-03 00:17 GMT

దిశ, ఇల్లందు: తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేసిన నాటినుంచి కరోనా అదుపులోకి వచ్చినా.. రెండో వేవ్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వైరస్ బారినపడి మరణిస్తున్న వారిసంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. రోజూ దాదాపు వెయ్యి మందికిపైగా వైరస్ బారినపడుతున్నారు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖులూ ఉన్నారు. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారినపడ్డారు. గత రెండ్రోజులుగా హరితహారం కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్న ఆమె కరోనా అనుమానిత లక్షణాలతో టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్యేకు శనివారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గత రెండ్రోజులుగా తనతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కోరారు.

Tags:    

Similar News