యూకే నుంచి వచ్చిన 13 మందికి పాజిటివ్

న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన 13 మందికి పాజిటివ్ తేలింది. మంగళవారం యూకే నుంచి అహ్మదాబాద్‌కు 257 మంది రాగా, అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం రాత్రి లండన్ నుంచి ఢిల్లీకి చేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఆరుగురిలో కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. యూకే నుంచి ఆదివారం కోల్‌కతాకు వచ్చిన వారిలోనూ ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూకేలోని కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతుండగా భారత్ ఆ దేశం నుంచి విమానరాకపోకలపై […]

Update: 2020-12-22 09:47 GMT

న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన 13 మందికి పాజిటివ్ తేలింది. మంగళవారం యూకే నుంచి అహ్మదాబాద్‌కు 257 మంది రాగా, అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం రాత్రి లండన్ నుంచి ఢిల్లీకి చేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఆరుగురిలో కరోనా వైరస్ ఉన్నట్టు తేలింది. యూకే నుంచి ఆదివారం కోల్‌కతాకు వచ్చిన వారిలోనూ ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూకేలోని కొత్త స్ట్రెయిన్ కలవరపెడుతుండగా భారత్ ఆ దేశం నుంచి విమానరాకపోకలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇంతలోపే ఆ దేశం నుంచి భారత్‌కు విచ్చేసిన 13 మందిలో కరోనా ఉన్నట్టు తేలడం గమనార్హం.

Tags:    

Similar News