'డియర్ కార్తీ మీ సినిమా అద్భుతం'.. కింగ్ నాగార్జున ఇంట్రెస్టింగ్ ట్వీట్

తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘సత్యం సుందరం’.

Update: 2024-09-30 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘సత్యం సుందరం’. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘96’(తెలుగులో జాను) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తమిళ స్టార్ హీరో సూర్య, సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. సత్యం సుందరం మూవీపై టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. అందులో ‘ప్రియమైన కార్తీ.. నిన్న రాత్రే మీ సినిమా చూశా.. మీరు, అరవింద్ చాలా బాగా చేశారు. మూవీ చూసినంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను, మన సినిమా ఊపిరి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న. ప్రేక్షకులు, విమర్శకులు సైతం మీ మూవీను అభినందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. టీమ్‌కు అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా కింగ్ నాగార్జున, కార్తీ కలిసి ‘ఊపిరి’ మూవీలో నటించిన విషయం తెలిసిందే.

Read More : Hero Karthi: పెద్ద సాహసమే చేసిన కార్తీ .. 3 రోజుల్లో సత్యం సుందరం మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?


Tags:    

Similar News