మెగా డాటర్‌కు బాబాయ్ నుంచి ప్రశంసలు.. నిహారికని అభినందిస్తూ డిప్యూటీ సీఎం స్పెషల్ ట్వీట్..

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ అతలాకుతలమైన విషయం తెలిసిందే.

Update: 2024-09-09 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ ముంపు బారిన పడి ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక ఇదే సమయంలో వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టానికి రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు భారీగా విరాళం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బుడమేరు వల్ల ముంపుకు గురైన పది గ్రామాలకు 50 వేలు చొప్పున రూ. 5 లక్షలు విరాళం ప్రకటించింది. ఈ విషయం నిహారిక తన సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఏపీ వరద బాధితుల కోసం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళాలు ప్రకటించిన సినీ పరిశ్రమలోని ప్రముఖులందరికి పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ వేదికగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో నిహారికకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు గారి కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. ఇటీవలే పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమాతో నిర్మాతగా విజయం సాధించిన నిహారిక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఏపీ డిప్యూటీ సీఎం ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్‌గా మారింది.

For tweet : https://x.com/APDeputyCMO/status/1832987493123387870


Similar News