హేమ కమిటీ రిపోర్టు పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్ నివేదా థామస్.. ఇది ఒక చేదు అనుభవం అంటూ

హీరో రానా సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘35-చిన్న కథ కాదు’. నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి నందకిషోర్‌ ఈమాని దర్శకత్వం వహిస్తున్నారు.

Update: 2024-08-31 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరో రానా సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం ‘35-చిన్న కథ కాదు’. నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి నందకిషోర్‌ ఈమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా.. 35 ఏళ్ల వయసుతో ఇద్దరు పిల్లల తల్లిగా నటిస్తోంది. కాగా ఈ మూవీ సెప్టెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా మీడియాతో ముచ్చటించింది నివేదా థామస్. ఇందులో భాగంగా మలయాళ ఇండస్ట్రీలో ఇటీవల జరిగిన లైంగిక వేధింపులు, హేమా కమిటీ నివేదికపై నివేతాను ప్రశ్నించగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆమె మాట్లాడుతూ.. 'మలయాళ పరిశ్రమకు ఇది ఒక చేదు అనుభవం, ప్రస్తుతం జరిగే పరిణామాలను నేను నిశితంగా గమనిస్తున్నాను, హేమ కమిటీ ఏర్పాటుకు కారణమైన WCC ను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతిచోటా అమలు చేయాలనీ నేను ఆశిస్తున్నాను, ఇది మహిళలకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికీ పని ప్రదేశాలలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం చాలా కీలకం' ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ స్పేస్‌లో ఉంటున్నాం, సో సురక్షితమైన వాతావరనం ఉండడం చాలా ముఖ్యం' అని నివేదా థామస్ తెలిపారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News