'అమ్మాయిలు సిగ్నల్ ఇస్తే చాలు.. రెండుమూడు నిమిషాల్లోనే..' క్యాస్టింగ్ కౌచ్‌పై అనసూయ సంచలన కామెంట్స్

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు సినిమాల్లో కీలక రోల్ చేసే స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ.

Update: 2024-09-26 03:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు సినిమాల్లో కీలక రోల్ చేసే స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ. అలా ఈ భామ రంగస్థలం సినిమాలో నటించి.. రంగమ్మత్త అనే క్యారెక్టర్‌కు జీవం పోసింది. దీంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప మూవీలో దాక్షాయణిగా విలన్‌(సునీల్)కి భార్యగా నటించింది. ఈ మూవీతో ఈ భామకు ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం పుష్ప మూవీ సీక్వేల్‌గా వస్తున్న పుష్ప 2 లో కూడా అనసూయ నటిస్తోంది. అయితే పుష్ప2లో కూడా స్ట్రాంగ్ క్యారెక్టరే ఉన్నట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది. అలాగే రీసెంట్‌గా జగపతి బాబు సరసన సింబా అనే మూవీలో కూడా నటించి అలరించింది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ అందాలతో అదరహో అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సంచలన రిపోర్టు ఇవ్వడం జరిగింది. అలాగే గత వారం టాలీవుడ్‌లో జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా యువ నటుడు, యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడంతో ఇండస్ట్రీలో ప్రకంపనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్ పై నటి, యాంకర్ అనసూయ చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..' ఈ గ్లామర్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ను నేను కొన్నిసార్లు ఎదుర్కొన్నాను. కానీ, దాని నుంచి సులభంగా తప్పించుకోవచ్చు. నటిగా ఎదిగే క్రమంలో కమిట్‌మెంట్ అనేది ఎక్కడోచోట ఎదురవుతుంది. అయితే.. ఒక సినిమా గురించి చర్చించే సమయంలో ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తున్నారో.. మనల్ని ఏ ఉద్దేశంతో చూస్తున్నారో మొదటి రెండు లేదా మూడు నిమిషాల్లోనే అర్థమవుతుంది. వాళ్ళు ఏం ఆశిస్తున్నారో అర్థమవుతుంది. ఈ సమయంలోనే మనం కొంచెం తెలివిగా వ్యవహరించి ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలి. నేనైతే.. అలాంటి సమయంలో తన భర్త, పిల్లల గురించి మాట్లాడుతూ .. ఆ టాపిక్ మార్చేస్తానని.. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఎవ్వరినీ నొప్పించకూడదని, ఎవ్వరితో వివాదాలు పెట్టుకోకుండా న్యూట్రల్‌గా వెళ్లాలని పేర్కొంది. అబ్బాయిలు ట్రై చేస్తూనే ఉంటారు అది వారి నైజం. కానీ అమ్మాయిలు సిగ్నల్ ఇస్తేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. స్టార్టింగ్‌లోనే అమ్మాయిలు గట్టిగా నో అని అనేస్తే ఎవరు మన జోలికి రారు. కాబట్టి నిర్భయంగా చెప్పే ధైర్యం మనలో ఉండాలి' అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.


Similar News