Pushpa 2: The Rule : ‘పుష్ప-2’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..ఫస్ట్‌హాఫ్‌ లాక్‌ అంటూ పోస్ట్

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’.

Update: 2024-10-08 14:36 GMT

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప-2’. ‘పుష్ప దిరైజ్‌’ బ్లాకబస్టర్ హిట్ సాధించడంతో.. దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప-2’పై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్మాత్మకమైన పాన్‌ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ మేరకు ‘‘పుష్ప-2’ ఫస్ట్‌హాఫ్‌ ఫుల్ ఫైర్‌తో పూర్తైంది.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తుపాను సృష్టించి చరిత్రను తిరగరాయడానికి పుష్ప వస్తున్నాడు. భారతీయ సినిమాకు ఇదొక కొత్త అధ్యాయనం. డిసెంబరు 6, 2024 పుష్ప: ది రూల్’ అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన బ్యాలెన్స్‌ షూటింగ్‌ను జరుపుకుంటునే మరోవైపు నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనాల్సిన పని లేదు. ఇక పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబరు 6న రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం.. విడుదలకు ముందే రూ. 1000 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసిందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.


Similar News