సెప్టెంబరు-2: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు..!

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

Update: 2024-09-02 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ప్రతి నెలా 1 వ తారీకు రాగానే ధరలు తగ్గుముఖం పడతాయోమోనని సామాన్య ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తారు. నిన్న సెప్టెంబరు 1 వ తేదీ కావడంలో చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ పై రూ. 39 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు నిన్నటి నుంచే అమలులోకి వచ్చాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1691. 50 కు పెరిగింది. హైదారాబాద్‌లో 1935 గా ఉంది. కానీ, ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వారికి నిరాశే మిగిలింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదారాబాద్: రూ 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944


Similar News