స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు సూచీలపై ప్రభావం చూపాయి.

Update: 2024-05-15 12:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాల నుంచి నష్టాల్లోకి జారాయి. మూడు రోజుల పాటు ర్యాలీ చేసిన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా బలహీనపడ్డాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 117.58 పాయింట్లు నష్టపోయి 72,987 వద్ద, నిఫ్టీ 17.30 పాయింట్ల నష్టంతో 22,200 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, రియల్టీ రంగాలు రాణించగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, హిందూస్తాన్ యూనిలీవర్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.50 వద్ద ఉంది. 

Tags:    

Similar News