కొత్త ఫ్లిప్, ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల చేసిన శాంసంగ్

తొలిసారిగా శాంసంగ్ తన స్మార్ట్‌రింగ్ విభాగంలో గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసింది.

Update: 2024-07-10 17:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోల్డ్, ఫ్లిప్ మొబైళ్లను బుధవారం విడుదల చేసింది. ప్యారిస్‌లో జరిగిన కంపెనీ అన్‌ప్యాక్‌డ్ ఈవెంట్ సందర్భంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్6, గెలాక్సీ జెడ్ ఫోల్డ్6 ఫోన్‌లను లాంచ్ చేసింది. వీటితో పాటు గెలాక్సీ వాచ్ 7, గెలాక్సీ వాచ్ ఆల్ట్రా, గెలాక్సీ బడ్స్ 3 సిరీస్‌లను కూడా తీసుకొచ్చింది. అంతేకాకుండా తొలిసారిగా శాంసంగ్ తన స్మార్ట్‌రింగ్ విభాగంలో గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసింది. గెలాక్సీ కొత్త ఫోన్‌లు సహా అన్ని ఉత్పత్తుల కోసం ముందస్తు ఆర్డర్లను కంపెనీ ప్రారంభించింది. ప్రారంభ ఆఫర్‌తో పాటు పలు ప్రయోజనాలను అందించనున్నట్టు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ధరలకు సంబంధించి మూడు రంగుల్లో లభించే గెలాక్సీ జెడ్ ఫోల్డ్6 12జీబీ, 256జీబీ ధర రూ. 1,64,999, 512జీబీ రూ. 1,76,999, 1టీబీ ధర రూ. 2,00,999గా నిర్ణయించింది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్6 12జీబీ 256జీబీ ధర రూ. 1,09,999, 512జీబీ ధరను రూ. 1,21,999గా నిర్ణయించింది. గెలాక్సీ వాచ్‌ 7 ధరను రూ.29,999, వాచ్‌ అల్ర్టా ధరను రూ.59,999కి లభిస్తుంది. గెలాక్సీ బడ్స్‌ 3 రూ. 14,999, బడ్స్‌ ప్రో ధరను రూ. 19,999గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అన్ని ప్రధాన ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభించామని కంపెనీ పేర్కొంది. జూలై 24 నుంచి సాధారణ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 


Similar News