శాంసంగ్‌ సీఈవో హాన్‌ జోంగ్‌ హీ కన్నుమూత

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ (Samsung) సీఈఓ హన్‌ జోంగ్‌-హీ (Han Jong-hee) (63) గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు.

Update: 2025-03-25 02:24 GMT
శాంసంగ్‌ సీఈవో హాన్‌ జోంగ్‌ హీ కన్నుమూత
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ (Samsung) సీఈఓ హన్‌ జోంగ్‌-హీ (Han Jong-hee) (63) గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కంపెనీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. హాన్ 2022లో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్, CEOగా నియమితులయ్యారు. ఆయన కంపెనీ బోర్డు సభ్యుడు కూడా. స్మార్ట్‌ఫోన్, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో చైనా కంపెనీల నుంచి శామ్‌సంగ్ గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో హాన్ మరణం సంభవించింది. ఇటీవలి కాలంలో, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్‌సంగ్ తన మొదటి స్థానాన్ని ఆపిల్‌కు కోల్పోయింది.

Tags:    

Similar News