ఉమ్మడి వరంగల్‌లో ‘బ్లాక్ ఫంగస్’ కలకలం

దిశ, మహబూబూబాద్ : మహబూబూబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలను శనివారం మహబూబూబాద్ ఏరియా ఆసుపత్రి ఈఎన్‌టి వైద్యులు, ఛాతీ వైద్యులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని బయ్యారం మండలం బాల్య తండాకు చెందిన గుగులోత్ చిరంజీవికి గత 15 రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్దారణ జరిగింది. తీవ్ర అనారోగ్యంతో అతను మహబూబూబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే రోగి కంటికి వాపు రావడంతో అనుమానం వచ్చిన ఈఎన్‌టి, […]

Update: 2021-05-22 09:25 GMT

దిశ, మహబూబూబాద్ : మహబూబూబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలను శనివారం మహబూబూబాద్ ఏరియా ఆసుపత్రి ఈఎన్‌టి వైద్యులు, ఛాతీ వైద్యులు గుర్తించారు. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని బయ్యారం మండలం బాల్య తండాకు చెందిన గుగులోత్ చిరంజీవికి గత 15 రోజుల కిందట కరోనా పాజిటివ్ నిర్దారణ జరిగింది.

తీవ్ర అనారోగ్యంతో అతను మహబూబూబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే రోగి కంటికి వాపు రావడంతో అనుమానం వచ్చిన ఈఎన్‌టి, చెస్ట్ వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. వైద్యులు సతీష్ మాట్లాడుతూ.. చిరంజీవికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం హైద్రాబాద్ కొవిడ్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News