పెళ్లికి వచ్చిన మహిళకు కరోనా

దిశ, నల్లగొండ: యదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆలేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకింది. జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతుండటంతో ఈ నెల 2న వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌గా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల సదరు మహిళ కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం మే 28న సికింద్రాబాద్​లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్య […]

Update: 2020-06-04 05:39 GMT

దిశ, నల్లగొండ: యదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఆలేరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకింది. జ్వరం, శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతుండటంతో ఈ నెల 2న వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్‌గా నిర్ధారించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 38 ఏళ్ల సదరు మహిళ కొంతకాలంగా గుండె సంబంధిత జబ్బుతో బాధ పడుతోంది. వైద్య చికిత్స కోసం మే 28న సికింద్రాబాద్​లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 2న కరోనా పరీక్షలు చేసి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. వెంటనే ఆమెను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ మే నెల 27న ఓ వివాహ వేడుకకు హాజరైనట్లు తేలింది. దీంతో వివాహానికి హాజరైన వారి వివరాలు సేకరించి వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

Tags:    

Similar News