YS Sharmila:‘జగన్ ఓ విషపు నాగు’.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) ఆస్తుల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Update: 2024-10-27 10:55 GMT

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(YS Jagan), వైఎస్ షర్మిల(YS Sharmila) ఆస్తుల వివాదం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్ జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఛార్జిషీట్‌లో వైఎస్ పేరు చేర్చిందే జగన్ అని పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. వైఎస్ మరణానికి సీఎం చంద్రబాబు(CM Chandrababu) కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు? చంద్రబాబు(Chandrababu)తో నాకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్ అని షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Tags:    

Similar News