ఖరీదైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించిన ఘనత వైఎస్‌దే : సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

Update: 2023-04-06 06:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశచరిత్రలో కనీవిని ఎరగని మార్పుకు శ్రీకారం చుట్టామన్నారు. డాక్టర్ మొబైల్ నెంబర్ విలేజ్ సెక్రటెరియట్ లో ఉంటుందన్నారు. ఎప్పుడూ ఫోన్ చేసినా డాక్టర్ అందుబాటులో ఉంటారని తెలిపారు. పీహెచ్ సీ లోని ఒక డాక్టర్ 104 గ్రామాలను సందర్శిస్తారన్నారు. మండలానికి రెండు పీహెచ్ సీలు, ఒక్కో పీహెచ్ సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారన్నారు. పెద్ద వ్యాధులు ఉన్నవారిని విలేజ్ క్లినిక్ ఆరోగ్యశ్రీని రిఫర్ చేస్తుందన్నారు. యాప్స్ రూపొందించి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రూపొందించామన్నారు. ఆరోగ్యశ్రీ పేరు వినగానే వైఎస్ ఆర్ పేరు గుర్తుకు వస్తుందన్నారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా పేదలకందించిన ఘనత వైస్ఎస్‌ఆర్‌ది అన్నారు.

Tags:    

Similar News