Mrs. India 2024 : విశ్వ విజేత హేమలతా రెడ్డి.. హర్షం వ్యక్తం చేసిన విశాఖ వాసులు
విశాఖలో జన్మించిన హేమలతా రెడ్డి మలేషియాలో జరిగిన ‘గ్లామ్ ఆన్ మిసెస్ ఇండియా’గా నిలిచారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో జన్మించిన హేమలతా రెడ్డి మలేషియాలో జరిగిన ‘గ్లామ్ ఆన్ మిసెస్ ఇండియా’గా నిలిచారు. మొదట లోకల్ టీవీ, జెమినీ టీవీ యాంకర్గా కెరీర్ను ప్రారంభించిన హేమలత ఎన్నో షోలకు హస్ట్గా వ్యవహరించారు. అదేవిధంగా హ్యాపీడేస్ సీరియల్లో లీడ్ రోల్ చేశారు. నటుడు జగపతిబాబుతో ‘ప్రవరాఖ్యుడు’ మూవీలో హీరోయిన్ పాత్రలో మెరిశారు. ‘నిన్నే చూస్తూ..’ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అనంతరం 300తో నిర్వహించిన మిసెస్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొని ఓ తెలుగమ్మాయి విజేతగా నిలవడంతో విశాఖ వాసులు ఆమెను ఘనంగా సన్మానించారు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశాఖ అమ్మాయి విశ్వ విజేతగా నిలవడం గర్వ కారణం అని అన్నారు. హేమలతా రెడ్డి సినిమాల్లో కూడా నటిస్తూ భవిష్యత్తులో మంచిపేరు తెచ్చుకోవాలంటూ అభినందించారు. పైడా కృష్ణ ప్రసాద్, కందుల నాగరాజులు ఆమెను ఘనంగా సన్మానించారు.