ఆన్‌లైన్ బెట్టింగ్‌కి అమ్మా, నాన్న బలి.. చావుబతుకుల్లో అక్క

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పులపాలైన దినేష్ అనే యువకుడు కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Update: 2024-10-05 05:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పులపాలైన దినేష్ అనే యువకుడు కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెట్టింగ్‌లో కుమారుడు రూ.కోటికి పైగా అప్పులు చేశాడని తెలియడంతో అవి తీర్చలేమని అర్థమై.. కుమారుడితో పాటు తల్లిదండ్రులు, అక్క కూడా పరుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దినేష్ తల్లిదండ్రులు జయంతి, నాగరాజు మృతి చెందగా.. దినేష్‌తో పాటు అతడి అక్క సునీత ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. 


Similar News