తెలుగు ఐఏఎస్‌ రోహిణిపై భూకబ్జా ఆరోపణలు

దిశ, నేషనల్ బ్యూరో : తన భూమిని కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి ఆక్రమించారంటూ బాలీవుడ్‌ గాయకుడు లక్కీ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2024-06-21 18:43 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తన భూమిని కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి ఆక్రమించారంటూ బాలీవుడ్‌ గాయకుడు లక్కీ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూమిని ఐఏఎస్‌ రోహిణి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూదన్‌ రెడ్డి లాక్కున్నారని ఆయన ఆరోపించారు. ఈ కబ్జా చేయడంలో ఆమెకు కొందరు పోలీసు అధికారులు సాయం చేశారన్నారు. దీనికి సంబంధించి 2022లోనే తాను కేసు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని లక్కీ అలీ పేర్కొన్నారు. అందుకే తాను లోకాయుక్తను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఆయన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. కాగా, గతేడాది ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌తో వివాదంతో ఐఏఎస్‌ రోహిణి సింధూరి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.


Similar News