AP News:బెంగళూరు నుంచి పులివెందులకు మాజీ సీఎం జగన్..కారణం ఏంటంటే?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెంగళూరులో ఉన్నారు. ఈ క్రమంలో నేడు(శనివారం) బెంగళూరు నుంచి పులివెందులకు రానున్నారు.

Update: 2024-08-31 08:21 GMT

దిశ,వెబ్‌డెస్క్:వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బెంగళూరులో ఉన్నారు. ఈ క్రమంలో నేడు(శనివారం) బెంగళూరు నుంచి పులివెందులకు రానున్నారు. ఇక్కడ మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. కాసేపట్లో ఆయన బెంగళూరు నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో పెండ్లిమర్రి మండలం మాచనూర్‌కి వెళ్తారు.

ఈ క్రమంలో అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు మాచనూరి చంద్రారెడ్డి కుటుంబసభ్యులను జగన్ పరామర్శిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో కాసేపు గడిపి గొందిపల్లికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్తారు. రాత్రికి పులివెందులలో జగన్ విశ్రాంతి తీసుకుంటారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా ఇడుపులపాయ లోని ఆయన సమాధి వద్ద జగన్ నివాళులు అర్పించనున్నారు. అదే రోజు రాత్రికి ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. సెప్టెంబర్ 4న ఆయన లండన్‌కు వెళ్లే అవకాశం ఉంది.


Similar News