పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజలు.. భయభ్రాంతులకు గురైన విద్యార్థులు

అల్లూరి సీతారామరాజు జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం ZPHS పాఠశాలలో వింత చేష్టలతో క్షుద్ర పూజలు చేశారు.

Update: 2024-09-27 03:49 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: అల్లూరి సీతారామరాజు జిల్లా గొలుగొండ మండలం ఏ ఎల్ పురం ZPHS పాఠశాలలో వింత చేష్టలతో క్షుద్ర పూజలు చేశారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణ కమ్యూనిటీ భవనం వద్ద పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఆ క్షుద్ర పూజలను చూసి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు వాటిని చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో ఈ విధంగా చేయడం పై పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు.


Similar News