వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించిన విద్యా సంస్థలు

విజయవాడ వరద బాధితుల సహాయార్థం విశాఖపట్నంలోని వాల్తేరు క్లబ్ సభ్యులు, ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని వివిధ విద్యా సంస్థలు, ఇతర సంస్థలు కలిసి రూ.21,87,116 విరాళం ప్రకటించాయి.

Update: 2024-09-05 14:21 GMT

దిశ ప్రతినిధి,విశాఖపట్నం:విజయవాడ వరద బాధితుల సహాయార్థం విశాఖపట్నంలోని వాల్తేరు క్లబ్ సభ్యులు, ఎస్.కోట నియోజకవర్గం పరిధిలోని వివిధ విద్యా సంస్థలు, ఇతర సంస్థలు కలిసి రూ.21,87,116 విరాళం ప్రకటించాయి. ఈ మేరకు సంబంధిత చెక్కులను విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఇతర టీడీపీ నేతలు, వాల్తేరు క్లబ్ సభ్యులు గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ ను తన చాంబర్లో కలిసి అందజేశారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ నేతలు గండి బాబ్జీ, పట్టాభిరాం, గొంప కృష్ణ, వాల్తేరు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Similar News