Chandrababu: మీడియా వాహనంపై దాడిని ఖండించిన చంద్రబాబు

మీడియా ప్రతినిధుల పై ఎంపీ అనుచరులు దాడిచేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు....

Update: 2023-05-19 11:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు సంబంధించి వార్తలు కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల పై ఎంపీ అనుచరులు దాడిచేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. మీడియా వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇదే వైసీపీ విష సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. మీడియా వాహనంపై దాడి చేస్తే.... CBI వాహనం వెంటాడకుండా ఉంటుందా?, అరెస్ట్ ఆగుతుందా? అని చంద్రబాబు నాయుడు నిలదీశారు.

ఇవి కూడా చదవండి : మీడియా ప్రతినిధులపై MP అవినాష్ రెడ్డి అనుచరుల దాడి

Tags:    

Similar News