Power Star Pawan Kalyan : తిరుపతిలో నేడు వారాహి సభ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తిరుపతిలో నేడు వారాహి(Varahi) సభ నిర్వహించబోతున్నారు.

Update: 2024-10-03 03:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తిరుపతిలో నేడు వారాహి(Varahi) సభ నిర్వహించబోతున్నారు. పట్టణంలోని జ్యోతిరావ్ పూలే సర్కిల్ లో సాయంత్రం జరగబోయే సభలో వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తన ఎక్స్(X) ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. 'స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు గడుస్తున్నా హిందూ ధర్మం మీద ఇంకా దాడులు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని మతాలను గౌరవిస్తూ.. హిందూ ధర్మం, ఆధ్యాత్మికను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గురువారం తిరుపతిలో నిర్వహించే సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తాను' అని తన ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు. 


Similar News