AP News:మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఆగ్రహం

ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-05 13:33 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. లడ్డూ కల్తీ వ్యవహారం పై సుప్రీంకోర్టు CBI పర్యవేక్షణలో సిట్ వేయడం పై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు(శనివారం) తిరుపతి నుంచి ఢిల్లీకి ఇండిగో విమానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు రేణిగుంట ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసిందని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. దీనిపై వైఎస్ జగన్ సిట్‌ లేదు గిట్‌ లేదంటూ చులకన భావనతో మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తిరుమల లడ్డూను అపవిత్రం పై సర్వత్రా విమర్శలు వస్తున్న సమయంలో సిట్‌ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయన్న భయం వైఎస్ జగన్‌లో పట్టుకుందని విమర్శించారు.


Similar News