Breaking: ఏపీలో కీలక పరిణామం.. సీనియర్ ఐఏఎస్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం

సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం బదిలీ చేసింది...

Update: 2024-06-24 17:29 GMT

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేదిని ప్రభుత్వం బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇటీవల వ్యవసాయ, గనుల శాఖ నుంచి కార్మిక శాఖకు ఆయన బదిలీ అయ్యారు. ఇటీవల వ్యవసాయ నుంచి కార్మికశాఖకు ద్వివేదీ బదిలీ అయ్యారు.అయితే ఆయనకు కార్మిక శాఖ బాధ్యతు ఇవ్వడంపై పాలనా వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. అంతేకాదు గ్రామ వార్డు సచివాలయాలకు పార్టీ రంగులపై ద్వివేది విమర్శలు ఎదుర్కొన్నారు. అటు మంత్రి పెద్దిరెడ్డి అక్రమాలకు పూర్తి సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల దృష్టం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జీఏడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ కార్యదర్శి నాయక్‌కు కార్మిక శాఖ అదనపు బాధ్యతలు అప్పగంచింది. 


Similar News