‘జగన్ అందుకే తిరుమల వెళ్లలేదు’.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వివాదం పై మరోసారి మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ క్రమంలో తిరుపతి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు దేవుడితో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

Update: 2024-09-28 10:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ వివాదం పై మరోసారి మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ క్రమంలో తిరుపతి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు దేవుడితో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి రోజా మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదం అడ్డం పెట్టుకుని దేవుడిని తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. జగన్ తిరుమల పర్యటన పై రాజకీయ రగడ కొనసాగుతోందన్నారు.

ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం పై ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో అలజడి రేపడం ఇష్టం లేకే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని మాజీ మంత్రి రోజా తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక జగన్ తిరుమలకు రాలేదన్న కూటమి నేతల వ్యాఖ్యలను ఆమె ఖండించారు. కుల రాజకీయాలు చేసే టీడీపీ ఇప్పుడు మత రాజకీయాలకు కూడా తెర తీస్తోందని ఫైరయ్యారు. భగవంతునితో పెట్టుకున్న చంద్రబాబుకు ఆ శ్రీవారే సమాధానం చెబుతారని రోజా విమర్శించారు.


Similar News