నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: టీడీపీ నేత సుధీర్ రెడ్డిపై సీఐ ఫిర్యాదు

నన్ను చంపేస్తాను అని బెదిరిస్తున్నారు. నాకు ప్రాణ రక్షణ కల్పించండి’ అని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Update: 2023-10-29 08:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘నన్ను చంపేస్తాను అని బెదిరిస్తున్నారు. నాకు ప్రాణ రక్షణ కల్పించండి’ అని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత తనను చంపుతానని బెదిరిస్తున్నారంటూ వాపోయారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే శ్రీకాళహస్తి టీడీపీ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుధీర్ రెడ్డి తనను చంపుతానని పదేపదే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు సుధీర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సుధీర్ రెడ్డి తో పాటు మొత్తం 26 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Tags:    

Similar News