Kakinada District:దేవస్థానం నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో 82 లక్షల రూపాయల విలువ గల నూతన బస్సులను భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొనుగోలు చేసి ప్రారంభించారు.

Update: 2024-10-27 09:08 GMT

దిశ,అన్నవరం : కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో 82 లక్షల రూపాయల విలువ గల నూతన బస్సులను భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొనుగోలు చేసి ప్రారంభించారు. ఈ బస్సులను స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. అలంకరించిన బస్సులకు అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సులను సిద్ధం చేశారు. అనంతరం శాసనసభ్యులు సత్య ప్రభ సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో NDA శ్రేణులు, ఆలయ ఈవో కె. రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ ఐ.వి రోహిత్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News