YS Sharmila:‘వాళ్లంతా మాఫియా డాన్‌లే’.. వైఎస్ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్!

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు.

Update: 2024-10-17 12:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఫైరయ్యారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ఏపీలో లిక్కర్ దుకాణాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు, సీఎం చంద్రబాబుకి పెద్ద తేడా లేదని షర్మిల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలు అమాంతం పెంచేసి లిక్కర్ మాఫియాను గుప్పిట్లో పెట్టుకున్నారని ఆమె అన్నారు. వైసీపీ హయాంలో కేవలం క్యాష్ ద్వారానే నాసిరకం మద్యం అమ్మి వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో లిక్కర్ మాఫియా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిస్తే.. బాబు పాలనలో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల చేతుల్లో నడుస్తోందని షర్మిల దుయ్యబట్టారు. వీరిద్దరికీ పెద్ద తేడా లేదని.. ‘అందరూ మాఫియా డాన్‌లే.. దొందు దొందే’ అంటూ షర్మిల సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు గారిని ఒక విషయంలో మాత్రం స్వాగతిస్తున్నాం అని షర్మిల అన్నారు. ‘‘జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదే. కానీ రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయిలో ఉంది. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో పరిశ్రమలు లేక యువత వలస వెళ్లింది. వలస వెళ్లలేని వారు కేవలం రూ.8 వేలు, రూ.10వేలు జీతానికి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. నిన్న చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 40-50 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన బాబు చెప్పినట్లు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే.. 5 ఏళ్లలో 20 లక్షలు వస్తాయి అనుకుందాం. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితే మిగతా వాళ్ల సంగతి ఏంటి? 20 కోట్ల ఉద్యోగాలు అని గతంలో మోడీ ప్రభుత్వం కూడా మోసం చేసింది. 20 కోట్ల ఉద్యోగాలలో మనకు ఎన్ని వచ్చాయి? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని మోడీకి ఎందుకు బాబు మద్దతు ఇస్తున్నారు ? రాష్ట్రంలో మీరు ఇచ్చే 20 లక్షలకు తోడు మరో 30 లక్షల ఉద్యోగాలు మోడీ ఇవ్వాలి. ఈ మేరకు బాబు కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. మోడీ,బాబు ఇద్దరు కలిసి కూర్చుని ఉద్యోగాల కల్పనపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.’’ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.


Similar News