Tragic incident:కన్నీళ్లు పెట్టిస్తోన్న ఘటన.. తల్లి కళ్ల ముందే ప్రాణాలు వదిలిన కుమారుడు

రాష్ట్రంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-10-27 13:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో హృదయవిదారక ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకును కాపాడుకునేందుకు ఓ తల్లి గుండెలవిసేలా రోదిస్తున్న ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తల్లి కళ్ల ముందే కుమారుడు ప్రాణాలు వదిలాడు. గంగాధర రావు(30) ఆటో దిగగానే ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై రోడ్డుపై పడిపోవడంతో తల్లి లేపేందుకు ప్రయత్నించింది. ‘నా కొడుకును కాపాడండయ్యా’ అని వేడుకున్నా ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. కి.మీ దూరంలో ఆసుపత్రి ఉన్నా పట్టించుకోలేదు. అంబులేన్స్ ఆలస్యంగా రావడం తో కన్నతల్లి కళ్లేదుటే ప్రాణాలు వదిలాడు. కళ్ల ముందే కొడకుని పోగొట్టుకున్న ఆ తల్లీ బాధ వర్ణనాతీతం.

ఓ తల్లి.. నా కొడుకుని బ్రతికించండి బాబూ అంటూ వేడుకుంటున్నా.. ఏ ఒక్క మనసు కనికరించలేదు. ఘటన ప్రాంతాల్లో ఎంతోమంది వెళ్తూ వస్తూ ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సహాయం చేయలేదు. సాయం చేయకపోగా ఆమె రోదిస్తున్న ఘటనను ఫోటోలు, వీడియోలు తీస్తూ కాలక్షేపం చేస్తూ గడిపారు. ఎవరి సహాయం లేక ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో కొడుకు ప్రాణాలు కళ్ల ముందే గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వీడియో చూసిన వారు ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అని ఓ గేయ రచయిత రాసిన మాటలు అక్షర సత్యాలు అవుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు.


Similar News