అనంతపురంలో అక్రమాలు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సీఎంకు ఫిర్యాదు

ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి....

Update: 2024-06-23 13:42 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై ఫిర్యాదు వచ్చాయి. దీంతో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. మిగిలిన వాటికి నోటీసులు అందజేశారు. అలాగే వైసీపీ నేతలు పాల్పడిన అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి కొడాలి నానితో పాటు పలువురు ఎమ్మెల్యేలలో ఆయా నియోజకవర్గాలకు చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు.

తాజాగా అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధికారంలో ఉండగా చేసిన అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రిటైర్డ్ అదనపు బాల నరసింహారెడ్డి ఫిర్యాదు చేశారు. కేంద్రం నిధులను వెంకట్రామిరెడ్డి దుర్వినియోగం చేశారని, వెంటనే విచారణ జరపాలని కోరారు.అలాగే ఆస్తి పన్ను కూడా ఎగ్గొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోదరులతో కలిసి అనంత వెంకట్రామిరెడ్డి అవినీతి చేశారని సీఎం చంద్రబాబు నాయుడుకు బాల నరసింహారెడ్డి ఫిర్యాదు చేశారు. 


Similar News