రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-15 06:45 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలనా సౌలభ్యం కోసం 26 జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. విజయనగరం-అనిత, శ్రీకాకుళం-కొండపల్లి శ్రీనివాస్ విశాఖ-బాలవీరాంజనేయస్వామి, అల్లూరి-సంధ్యారాణి, పార్వతీపురం మన్యం, కోనసీమ-అచ్చెన్నాయుడు, కర్నూలు, తూ.గో-నిమ్మల రామానాయుడు, అనకాపల్లి-కొల్లు రవీంద్ర, కాకినాడ-నారాయణ, NTR జిల్లా-సత్యకుమార్, కృష్ణా-వాసంశెట్టి సుభాష్‌ పల్నాడు, ప.గో-గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం-ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు-ఫరూఖ్‌, గుంటూరు-కందుల దుర్గేష్‌, బాపట్ల-పార్థసారథి, నంద్యాల-పయ్యావుల కేశవ్, శ్రీసత్యసాయి, తిరుపతి-అనగాని సత్యప్రసాద్, అనంతపురం-టీజీ భరత్, కడప-సవిత, అన్నమయ్య-బీసీ జనార్ధన్‌రెడ్డి, చిత్తూరు-రాంప్రసాద్‌రెడ్డి, ఏలూరు-నాదెండ్ల మనోహర్ లను నియమిస్తూ ప్రభుత్తం నిర్ణయం తీసుకుంది.


Similar News