Breaking: ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖల్లో ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే పలువురి అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ సీఈవోగా ఉన్న బి. సునీల్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ పారెస్ట్కు బదిలీ చేసింది. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ సీఈవోగా వాడ్రేవు వినయ్ చంద్ను నియమించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే కొనసాగాలని ప్రభుత్వం సూచించింది. ఫైనాన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న పీయూష్ కుమార్కు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రణాళికా శాఖ ఏపీ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.