AP:వరద బాధితులకు టీడీపీ ఎంపీ భారీ విరాళం

ఏపీలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి.

Update: 2024-09-03 09:40 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. ఇళ్లలోకి వరద నీరు ప్రవహించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వరద బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితులకు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తన భార్య , కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన సీఎం చంద్రబాబుకు అందజేశారు. కాగా వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వాలనుకునే వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం (7906796105)ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించింది.


Similar News