AP News:గన్నవరం ఎయిర్ పోర్టులో టీడీపీ ఎమ్మెల్యేకు షాక్!

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఊహించని ఓటమి చవిచూసింది.

Update: 2024-07-08 11:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఊహించని ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో వైసీపీకి, టీడీపీకి మధ్య వార్ నడుస్తోంది. వైసీపీ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్ తగిలింది. .గతంలో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు.. పలు కారణాల వల్ల వైసీపీ నుంచి తప్పుకున్నారు. తర్వాత రఘురామ టీడీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి వైసీపీకి రఘురామకృష్ణం రాజుకు విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ రోజు (సోమవారం) ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుకు చుక్కెదురైంది. ఎయిర్ పోర్టు నుంచి బయటికి వస్తున్న రఘురామకు అక్కడే ఉన్న వైసీపీ క్యాడర్ షాకిచ్చారు. రఘురామను చూడగానే వారు ‘జై జగన్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో రఘురామ పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు.


Similar News